ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన.. ఎక్కువ యూజర్లు ఉన్న మెసేజింగ్ ప్లాట్ఫామ్ ఏదంటే టక్కున వాట్సప్ పేరు చెబుతాం. ఇండియాలో కూడా వాట్సప్కు ఎక్కువ యూజర్ బేస్ ఉంది. ఎవరికైనా మెసేజ్ పంపించాలన్నా.. ఫోటోలు, వీడియోలు షేర్ చేయాలన్నా వాట్సప్నే ఎక్కువగా వాడుతుంటాం. అందుకే సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు దీని మీద పడ్డారు. వాట్సప్ యూజర్లను టార్గెట్ చేసుకొని వాళ్ల బ్యాంక్ డిటెయిల్స్ లాక్కొని అకౌంట్లను కొల్లగొడుతున్నారు.
దాని కోసం ఫిషింగ్ లింక్స్ను ఉపయోగించుకుంటున్నారు స్కామర్లు. వాట్సప్కు Rediroff.com, Rediroff.ru పేరుతో లింక్స్ ఫార్వార్డ్ చేస్తారు. వాటి మీద యూజర్లు క్లిక్ చేయగానే.. ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. రివార్డులు ఇస్తామని ఆశ చూపించి యూజర్ల పర్సనల్ డేటాను లాక్కుంటారు.
సర్వేలో పాల్గొనాలని చెప్పి యూజర్ డిటెయిల్స్ అన్నీ అడుగుతారు. బ్యాంకు వివరాలు, అడ్రస్ కూడా అడుగుతారు. రివార్డులను చూసి టెంప్ట్ అయి కొందరు యూజర్లు వాళ్ల ట్రాప్లో పడి అడిగిన వివరాలు పంపించి వాళ్ల ట్రాప్లో పడతారు.
దాని తర్వాత వాట్సప్కు తెలియని నెంబర్ నుంచి sorry, I did not recognise you, may I know who this is అంటూ మెసేజ్లు పంపిస్తారు. దానికి రెస్పాండ్ అయిన వాళ్లతో మాటలు కలిపి.. వాళ్లను ట్రాప్ చేసి రివార్డుల ఆశ చూపి.. వాళ్ల వివరాలన్నీ లాగుతారు. ఆ తర్వాత ఆ వివరాలతో సైబర్ నేరాలు చేస్తుంటారు.