Microsoft | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఇంటర్నెట్ ప్రపంచంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన బ్రౌజింగ్ యాప్ ‘ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్’ శకం ముగిసింది. 1995లో ప్రారంభమై 28 ఏండ్లుగా సేవలందిస్తున్న ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇకపై మనకు కనిపించదు. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ డివైజ్లపై ఫైనల్ అప్డేటెట్ వెర్షన్ను ‘ఐఈ11’ను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ మంగళవారం ప్రకటించింది. కొత్త బ్రౌజర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అప్డేట్ ద్వారా పాత బ్రౌజర్ను నిలిపివేసింది.
ఈ బ్రౌజర్ ఇకపై ‘నో మోర్’ ‘రిటైర్డ్’ అని పేర్కొన్నది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కు టెక్నికల్ సపోర్టును ఆపేస్తున్నట్టు వెల్లడించింది. పాత బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ అప్డేట్ ఇస్తామని తెలిపింది. ‘మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అప్డేట్ను కమర్షియల్, కన్జూమర్ డివైజ్లన్నింటికీ ఒకేసారి ఇస్తాం’ అని పేర్కొన్నది. ‘ఐఈ’ పూర్తిగా నిలిపివేసే ప్రక్రియను మైక్రోసాఫ్ట్ గత ఏడాది డిసెంబర్లోనే ప్రకటించింది.