న్యూఢిల్లీ : యాపిల్తో ఒప్పందానికి అనుగుణంగా భారత్లో అతిపెద్ద ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్ (IPhone Assembly Plant) ఏర్పాటుకు టాటా గ్రూప్ సన్నాహాలు చేపట్టింది. తమిళనాడులోని హోసూర్లో ఈ భారీ ప్లాంట్ను ఏర్పాటు చేయడం ద్వారా రెండేండ్లలో 50,000 ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని బ్లూంబర్గ్ రిపోర్ట్ పేర్కొంది. ఈ ప్లాంట్లో 12 నుంచి 18 నెలల్లోగా కార్యకలాపాలు చేపట్టే లక్ష్యంగా టాటా గ్రూప్ కసరత్తు సాగిస్తోంది.
తయారీ రంగంలో చైనాపై ఆధారపడటం తగ్గించే క్రమంలో సప్లయి చైన్ను భిన్న ప్రాంతాల్లో చేపట్టాలన్న యాపిల్ వ్యూహానికి అనుగుణంగా ఈ ప్లాంట్ అందుబాటులోకి రానుంది. టాటా గ్రూప్ ఇప్పటికే విస్ట్రన్ కార్ప్ ఫెసిలిటీని స్వాధీనం చేసుకోవడం ద్వారా కర్నాటకలో ఇప్పటికే ఐఫోన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేసింది.
భారత్, థాయ్ల్యాండ్, మలేషియా సహా పలు దేశాలకు చెందిన అసెంబ్లీ, కాంపోనెంట్ మ్యాన్యుఫ్యాక్చరర్లతో యాపిల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. టాటా గ్రూప్ చేపట్టబోయే నూతన ప్లాంట్ యాపిల్ దేశీయంగా చేపట్టే సప్లయి చైన్ సన్నాహాల్లో కీలకంగా వ్యవహరించనుంది. ఇక యాపిల్ ప్రోడక్ట్స్ విక్రయానికి సంబంధించి 100 రిటైల్ స్టోర్స్ను టాటా ప్రారంభించనుంది.
Read More :
Chennai Rains | ఇంకా వరద గుప్పిట్లోనే చెన్నై.. మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చిన ఐఎండీ