సూర్యాపేట : తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ. 33 లక్షల రూపాయల వ్యయంతో వ్యయంతో ఆధునీకరించిన కొవిడ్ ఐషోలేషన్ సెంటర్ను తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కరోనాతో ఎవరు ఆందోళన చెందొద్దని సూచించారు. ప్రభుత్వం కరోనా బాధితుల కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు.
అనంతరం తుంగతుర్తి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ను పరిశీలించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.