న్యూఢిల్లీ : దృష్టి లోపాలతో బాధపడేవారితో పాటు అంధుల్లో కొత్త ఆశలు చిగురించేలా ఏఐ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో స్మార్ట్ విజన్ గ్లాస్లను ఓ ప్రైవేట్ ఆస్పత్రి లాంఛ్ చేసింది. ఈ విజన్ గ్లాస్లు తేలికగా ఉండటంతో పాటు యూజర్లకు సహకరించేలా కెమెరా, సెన్సర్ ఫీచర్లు సహా ఏఐ\ఎంఎల్ టెక్నాలజీని కలిగిఉంటాయి.
ఈ గ్లాస్లు ఇమేజ్లను ప్రొజెక్ట్ చేయడం, నడిచేందుకు సహకరించడం, ఫేస్ రికగ్రేషన్ సామర్ధ్యాలను కలిగిఉంటాయి. చదివి, అర్ధం చేసుకోగల స్మార్ట్ ఇయర్పీస్ కూడా వీటితో పాటు యూజర్లకు అందిస్తారు. వాయిస్ అసిస్టెన్స్, జీపీఎస్ నావిగేషన్ వంటి అదనపు ఫీచర్లు యూజర్లకు నడిచే క్రమంలో ఏవైనా అడ్డంకులు ఎదురైతే ఇవి అప్రమత్తం చేస్తాయి.
విజన్ ఎయిడ్ ఇండియా, స్టార్టప్ ఎస్హెచ్జీ టెక్నాలజీస్ సహకారంతో ఈ వేరబుల్ డివైజ్ను డాక్టర్ ష్రాఫ్స్ చారిటీ ఐ హాస్పిటల్ ఇటీవల లాంఛ్ చేసింది. దేశం నుంచి అంధత్వాన్ని నివారించే క్రమంలో తాము ఈ ప్రోడక్ట్తో ముందుకొచ్చామని హాస్పిటల్ ఈడీ, సీఈవో ఉమాంగ్ మాధుర్ చెప్పుకొచ్చారు.
Read More