స్మార్ట్ఫోన్ యూజర్లకు సరికొత్త ఫీచర్లను అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది సామ్సంగ్. అందుకే.. స్మార్ట్ఫోన్ల సేల్స్లో సామ్సంగ్ ఎప్పుడూ టాప్లో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సామ్సాంగ్ ఫోన్లే అధికంగా అమ్ముడవుతాయి.. దానికి కారణం.. సామ్సంగ్ ఫోన్లలో ఉండే బెస్ట్ ఫీచర్స్.
ఇక.. తాజాగా సామ్సంగ్.. అద్భుతమైన ఫీచర్లతో నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్లను విడుదల చేస్తోంది. సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 పేర్లతో సామ్సంగ్ ఈ ఫోన్లను విడుదల చేయనుంది. ఆగస్టు 11న ఈ ఫోన్లను సామ్సంగ్ ఆన్లైన్ ప్రజెంటేషన్ ద్వారా మార్కెట్లోకి రిలీజ్ చేయనుంది.
సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 5జీ ఫోన్.. రెండు ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లేలతో రానుంది. అలాగే.. 6.2 ఇంచ్ డిస్ప్లే రిజిల్యూషన్ 2268 * 832 పిక్సల్స్, 7.6 ఇంచ్ డిస్ప్లే 2209 *1768 పిక్సల్స్ రిజల్యూషన్, యూటీజీ, క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 888 చిప్సెట్ ప్రాసెసర్తో 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ మెమోరీ, 4400 ఎంఏహెచ్ బ్యాటరీ(వైర్లెస్ చార్జింగ్) లాంటి ఫీచర్లతో లభించనుంది.
ఇక.. ఫ్లిప్ 3 ఫీచర్ల విషయానికి వస్తే.. 1.9 ఇంచ్ ఔట్ సైడ్ డిస్ప్లే, 6.7 ఇంచ్ డైనమిక్ ఏఎమ్వోఎల్ఈడీ 2 ఎక్స్ డిస్ప్లే, ఎఫ్హెచ్డీ ప్లస్ రిజల్యూషన్, 120 హెచ్జెడ్ రీఫ్రెష్ రేట్, క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 888 చిప్సెట్, 8జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ(వైర్లెస్ చార్జింగ్) ఆప్షన్లతో ఈ ఫోన్ విడుదల కానుంది.