సియోల్ : వచ్చే ఏడాది 8కే మినీఎల్ఈడీ, 4కే ఓఎల్ఈడీ టీవీలను లాంఛ్ చేసేందుకు దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ సన్నాహాలు చేపట్టింది. నియో క్యూఎల్ఈడీ టీవీ బ్రాండ్ను క్యారీ చేస్తూ 8కే మినీఎల్ఈడీ టీవీ ముందుకు రానుంది.
8కే రిజల్యూషన్ సామర్ధ్యం కలిగిన ఓఎల్ఈడీ టెక్నాలజీని శాంసంగ్ డిస్ప్లే చేయనుందని గిజ్మోచైనా నివేదిక వెల్లడించింది. 2022లో రానున్న 8కే క్యూఎల్ఈడీ యూనిట్లను 30 లక్షల వరకూ విక్రయించాలని, 20 లక్షల 4కే మోడల్స్ను విక్రయించాలని శాంసంగ్ యోచిస్తోంది. డిస్ప్లే విభాగం శాంసంగ్ డిస్ప్లే నుంచి ఓఎల్ఈడీ ప్యానెల్స్ తయారీ సామర్ధ్యాన్ని పెంచేందుకు శాంసంగ్ సన్నద్ధమవుతోంది.
ఇక మూడో క్వార్టర్లో గ్లోబల్ మార్కెట్లో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ టీవీ అమ్మకాలు 28.7 శాతం వాటా కలిగిఉండగా, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వాటా 18.4 శాతంగా నమోదైంది. మొత్తం అమ్మకాల్లో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వాటా 30.2 శాతం కాగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వాటా 18.8 శాతంగా ఉంది. ఉమ్మడి మార్కెట్ వాటాలో వరసగా 16 సంవత్సరాలుగా శాంసంగ్ నెంబర్ వన్ స్ధానాన్ని కాపాడుకుంటోంది.