న్యూఢిల్లీ : శాంసంగ్ తన న్యూ జనరేషన్ గెలాక్సీ ఎస్23 సిరీస్ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లాంఛ్ చేయనుంది. అమెరికాలో జరిగే శాంసంగ్ అన్ప్యాక్డ్ 2023 ఈవెంట్ వేదికగా ఈ స్మార్ట్ఫోన్ సిరీస్ లాంఛ్ అవుతుందని దక్షిణ కొరియా డైలీ కొరియా జూంగాంగ్ డైలీ వెల్లడించింది.
అంతకుముందు గెలాక్సీ ఎస్23 సిరీస్ లాస్వెగాల్ వేదికగా జనవరిలో సీఈఎస్ 2023 ఈవెంట్లో లాంఛ్ అవుతుందని వార్తలు వచ్చాయి. ఇక ఫిబ్రవరిలో రానున్న గెలాక్సీ ఎస్23 సిరీస్లో భాగంగా గెలాక్సీ ఎస్23, ఎస్23 ప్లస్, ఎస్23 అల్ట్రా స్మార్ట్ఫోన్లను శాంసంగ్ లాంఛ్ చేస్తుందని సౌత్ కొరియన్ డైలీ పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్లు ఎస్22, ఎస్21 ఫోన్ల కంటే ధర అధికంగా ఉండనున్నాయి.
విడిపరికరాల ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో శాంసంగ్ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ల ధరలు భారంగానే ఉంటాయని చెబుతున్నారు. శాంసంగ్ ఎస్23 సిరీస్ విడుదల తేదీలపై కంపెనీ అధికారికంగా వెల్లడించకున్నా న్యూ గెలాక్సీ ఎస్ ఫోన్లను శాంసంగ్ గత కొన్నేండ్లుగా ఏడాది ఆరంభంలో లాంఛ్ చేస్తోంది.
ఈ ఏడాది ఆరంభంలో ఫిబ్రవరిలో శాంసంగ్ గెలాక్సీ ఎస్22ను ప్రవేశపెట్టింది. న్యూ సిరీస్ స్మార్ట్ఫోన్లు లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్సెట్తో రానున్నాయి. 200 ఎంపీ కెమెరా సపోర్ట్, వైఫీ 7, న్యూ 5జీ మోడెమ్ వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్ఫోన్లు కస్టమర్లను ఆకట్టుకోనున్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.