న్యూఢిల్లీ : శాంసంగ్ నెక్ట్స్ జనరేషన్ గెలాక్సీ ఎస్23 సిరీస్ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది. గెలాక్సీ ఎస్23 సిరీస్లో భాగంగా రెగ్యులర్ గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్, గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్మార్ట్ఫోన్లను శాంసంగ్ లాంఛ్ చేయనుంది. మూడు లేటెస్ట్ శాంసంగ్ స్మార్ట్ఫోన్లు క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానున్నాయి.
గెలాక్సీ ఎస్23 అల్ట్రా బెటర్ బిల్డ్ స్లీక్ బాడీతో 200ఎంపీ కెమెరాతో కస్టమర్లను ఆకట్టుకుంటుందని ప్రముఖ టిప్స్టర్ ఐస్ యూనివర్స్ అంచనా వేసింది. గెలాక్సీ ఎస్23 అల్ట్రా మోడల్లో 50డబ్ల్యూ ఫాస్ట్చార్జింగ్ సపోర్ట్ను శాంసంగ్ జోడించనుంది. ఎస్23 లో 6.1 ఇంచ్ స్ర్కీన్ రానుండగా, ఎస్23 ప్లస్, అల్ట్రా మోడల్స్లో 6.7 ఇంచ్ డిస్ప్లే కలిగిఉంటాయి.
స్క్రీన్ కంటెంట్కు అనుగుణంగా రిఫ్రెష్ రేట్ను అడ్జెస్ట్ చేసేందుకు ఈ స్మార్ట్ఫోన్లు ఎల్టీపీఓ ప్యానెల్తో రానున్నాయని అంచనా. ఇక భారత్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ రూ. 65,000 నుంచి ప్రారంభమవనుండగా ఖరీదైన అల్ట్రా మోడల్ ధర రూ. లక్షకు పైగా ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.