న్యూఢిల్లీ : బడ్జెట్ ధరలో దేశీ మార్కెట్లో 5జీ ఫోన్ను శాంసంగ్ లాంఛ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ (Samsung Galaxy M14) ఎం 14 5జీ ఈనెల 21 నుంచి అమెజాన్ ద్వారా ఈ స్మార్ట్ఫోన్ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. 4జీబీ ర్యాం, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 13,490 నుంచి అందుబాటులో ఉంటుంది. 6జీబీ ర్యాం, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 15,490కి లభిస్తుంది.
ఇక శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్తో 6.6 ఇంచ్ పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్ప్లేను కలిగిఉంటుంది. శాంసంగ్ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ అండ్రాయిడ్ 13 అవుటాఫ్ ది బాక్స్ ఓఎస్పై రన్ అవుతుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్లో 50ఎంపీ ప్రైమరీ సెన్సర్తో పాటు రెండు 2ఎంపీ సెన్సర్లతో కస్టమర్ల ముందుకొచ్చింది. ముందుభాగంలో 13ఎంపీ సెల్ఫీ కెమెరా ఆకట్టుకుంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ 25డబ్ల్యూ ఫాస్ట్చార్జింగ్ సపోర్ట్తో 6000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. ఈ బడ్జెట్ 5జీ స్మార్ట్ఫోన్ సిల్వర్, బ్లూ, డార్క్ బ్లూ కలర్ ఆప్షన్స్లో లభిస్తుంది.
Read More