న్యూఢిల్లీ : శాంసంగ్ గెలాక్సీ ఏ14 జనవరి 18న భారత్ మార్కెట్లో లాంఛ్ కానుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. కంపెనీ అధికారిక వెబ్సైట్లో లేటెస్ట్ డివైజ్ మోడల్ నెంబర్ ప్రత్యక్షం కావడంతో దేశీ మార్కెట్లో గెలాక్సీ ఏ14 త్వరలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. గెలాక్సీ ఏ13 5జీకి కొనసాగింపుగా గెలాక్సీ ఏ14 5జీని శాంసంగ్ లాంఛ్ చేస్తోంది.
గెలాక్సీ ఏ13 5జీ స్ధానంలో శాంసంగ్ భారత్లో కేవలం 4జీ వెర్షన్ హ్యాండ్సెట్నే ప్రవేశపెట్టడంతో తాజాగా గెలాక్సీ ఏ14 5జీని లాంఛ్ చేస్తోంది. ఏ13 5జీ వెర్షన్గా గెలాక్సీ ఏ14 5జీ కస్టమర్ల ముందుకు రావడంతో దీని ధర దాదాపు రూ .20,000 వరకూ ఉంటుందని అంచనా. గెలాక్సీ ఏ14 5జీ మీడియాటెక్ డైమన్సిటీ 700 ఎస్ఓసీ ప్రాసెసర్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది.
పాత వెర్షన్తో పోలిస్తే అధికంగా 6.6 ఇంచ్ స్క్రీన్, ముందుభాగంలో 5ఎంపీ కెమెరా స్ధానంలో 13 ఎంపీ కెమెరాతో లేటెస్ట్ స్మార్ట్ఫోన్ కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఇక రియర్ ప్యానెల్లో 50 ఎంపీ మెయిన్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సర్, 2 ఎంపీ మ్యాక్రో కెమెరా ఉంటుంది.