న్యూయార్క్ : ఈ ఏడాది జనవరిలో ఉద్యోగులతో కాల్లో ముచ్చటిస్తూ ఏకంగా 7000 మందిని తొలగించిన సేల్స్ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియాఫ్ తన నిర్ణయంపై విచారం వెలిబుచ్చారు. ఉద్యోగులను తొలగించిన తీరు సరైన ఆలోచన కాదని తాజాగా పేర్కొన్నారు. సేల్స్ఫోర్స్ ఇటీవల 10 శాతం మంది ఉద్యోగులపై వేటు వేయడంతో 7000 మంది ఉద్యోగులు కొలువులు కోల్పోయారు.
లేఆఫ్స్పై సేల్స్ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియాఫ్ న్యూయార్క్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విచారం వ్యక్తం చేశారు. ఫోన్ కాల్లో ఉద్యోగులందరితో రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో 7000 మంది ఉద్యోగులను తొలగించడం చెత్త ఆలోచన అని స్పష్టం చేశారు. కఠిన నిర్ణయాన్ని అంతమంది సమక్షంలో కాల్లో వెల్లడించడం సంక్లిష్టమైన అంశమని, దాని మూల్యం చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
అంతర్జాతీయ ఆర్ధిక అనిశ్చితే లేఆఫ్స్కు కారణమని కంపెనీ వెల్లడించింది. కరోనా మహమ్మారి విజృంభించిన వేళ రాబడి పెరగడంతో పెద్దసంఖ్యలో ఉద్యోగులను కంపెనీ హైర్ చేయడమే ప్రస్తుత లేఆఫ్స్కు కారణమని ఉద్యోగులకు రాసిన లేఖలో బెనియాఫ్ పేర్కొన్నారు. ఉద్యోగులను అధికంగా హైర్ చేయడంతో ప్రస్తుతం ఆర్ధిక మందగమనానికి దారితీసిందని, ఇందుకు తాను పూర్తి బాధ్యత వహిస్తానని ఆ లేఖలో సేల్స్ఫోర్స్ సీఈఓ వివరించారు,