న్యూఢిల్లీ : రెడ్మి నోట్ 12 సిరీస్ కింద షియామి మూడు లేటెస్ట్ స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేసింది. న్యూ సిరీస్ స్మార్ట్ఫోన్లు 6.7 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటి ఫీచర్లతో కస్టమర్ల ముందుకొచ్చాయి.
రెడ్మి నోట్ 12 సిరీస్లో భాగంగా వెనిలా రెడ్మి నోట్ 12, రెడ్మి నోట్ 12 ప్రొ, రెడ్మి నోట్ 12ప్రొ+ను లాంఛ్ చేసింది. ఇక ప్రొ+ మోడల్ 200ఎంపీ ప్రైమరీ కెమెరా, 120డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి హాట్ ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. చైనాలో షియామి న్యూ స్మార్ట్ఫోన్లు లాంఛ్ కాగా భారత్లో ఇవి ఎప్పుడు లాంఛ్ అవుతాయనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
రెడ్మి నోట్ 12 ప్రొ+ బ్లూ, వైట్, బ్లాక్, పర్పుల్ కలర్స్లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ రూ25,000 నుంచి రూ 27300 మధ్య లభిస్తుంది. ఇక న్యూ రెడ్మి నోట్ 12 స్మార్ట్ఫోన్లు ఒకే రకంగా కనిపించినా రెడ్మి నోట్ 12, నోట్ 12ప్రొ, నోట్ 12ప్రొ+ ఐఫోన్ 12 సిరీస్ తరహాలో ఫ్లాట్ఎడ్జ్ డిజైన్ను కలిగిఉంటాయి. ఇక రెడ్మి నోట్ 12 5జీ రూ 13600 నుంచి రూ 19,300 మధ్య లభిస్తుంది.