న్యూఢిల్లీ : భారత్లో త్వరలో న్యూ రెడ్మి కే సిరీస్ను తిరిగి తీసుకురానున్నట్టు రెడ్మి అధికారిక టీజర్లో వెల్లడించింది. భారత్లో రెడ్మి కే సిరీస్ రీలాంఛ్కు సంబంధించి కంపెనీ సోమవారం తన సోషల్ మీడియా వేదికలపై తెలిపింది. మార్చి 2022లో రెడ్మి కే30 లాంఛ్ తర్వాత రెడ్మి భారత్లో రెడ్మి కే సిరీస్ నుంచి ఎలాంటి ఫోన్నూ లాంఛ్ చేయలేదు. చైనాలో లాంఛ్ చేసిన ఫోన్లు భారత్లో పోకో ఫోన్లుగా ఎంట్రీ ఇచ్చాయి.
భారత్లో తొలుత రెడ్మి కే20, కే20 ప్రొ స్మార్ట్ఫోన్లతో కే సిరీస్ను కంపెనీ లాంఛ్ చేసింది. ఈ రెండు ఫోన్లకూ కస్టమర్ల నుంచి మెరుగైన స్పందన లభించింది. భారత్లో మళ్లీ రెడ్మి కే సిరీస్ను తిరిగి ప్రవేశపెట్టాలని రెడ్మి నిర్ణయించింది. భారత్లో త్వరలోనే రెడ్మి కే50 సిరీస్ను తీసుకురావాలని కంపెనీ సన్నాహాలు చేపట్టింది. కే50 సిరీస్ ఇటీవల చైనాలో లాంఛ్ కాగా, రెడ్మి కే50, రెడ్మి కే50 ప్రొలను త్వరలోనే భారత్లో ఎంట్రీ ఇచ్చేలా కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఇక రెడ్మి కే50 సిరీస్లో రెండు ఫోన్లు మీడియాటెక్ చిప్సెట్తో ముందుకు రానున్నాయి. కే50 డైమెన్సిటీ 8100 ఎస్ఓసీ చిప్సెట్తో, కే50 ప్రొ డైమెన్సిటీ 9000 చిప్సెట్తో కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి. రెండు పోన్లు 6.67 ఇంచ్ అమోల్డ్ క్యూహెచ్డీ+ డిస్ప్లేను కలిగిఉంటాయి. కే50 67డబ్ల్యూ ఫాస్ట్చార్జింగ్ సపోర్ట్తో 5500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకు రానుంది. ఈ రెండు డివైజ్లు ఎంఐయూఐ 13 అవుటాఫ్ ది బాక్స్ ఓఎస్పై రన్ అవుతాయి. మెరుగైన కెమెరా స్పెసిఫికేషన్స్తో ఆకట్టుకోనున్నాయి. ఇక రెడ్మి కే50 రూ 28,000 నుంచి అందుబాటులో ఉండగా, రెడ్మి కే50 ప్రొ రూ 35,000 నుంచి లభిస్తుంది.