న్యూఢిల్లీ : షియోమికి చెందిన రెడ్మి 11 5జీ భారత్లో త్వరలో ఎంట్రీ ఇవ్వనుంది. రెడ్మి 11 5జీతో కూడిన మీడియాటెక్ ప్రాసెసర్ను కలిగిఉంటుందని 91 మొబైల్స్ వెల్లడించింది. రెడ్మి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ జూన్లోనే భారత్లో లాంఛ్ కానుంది. రెడ్మి 10కు కొనసాగింపుగా రెడ్మి 11 5జీ కస్టమర్ల ముందుకు రానుంది.
రెడ్మి 11 కూడా బడ్జెట్ స్మార్ట్పోన్గానే భారత్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. రెడ్మి 11 5జీ దేశీ మార్కెట్లో రూ 13,999 నుంచి అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. లేటెస్ట్ రెడ్మి ఫోన్ 6.58 ఇంచ్ ఫుల్హెచ్డీ+డిస్ప్లేతో కస్టమర్ల ముదుకు రానుంది. 90హెచ్జడ్ రిఫ్రెష్ రేట్తో ఎల్సీడీ ప్యానెల్తో ఈ స్మార్ట్పోన్ రానుంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది. 18డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో దేశీ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇక కెమెరా విషయానికి వస్తే రెడ్మి 11 5జీ డ్యూయల్ రియర్ కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ను కలిగిఉంటుంది. రెడ్మి లేటెస్ట్ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుటాఫ్ ది బాక్స్ ఓఎస్పై రన్ అవుతుంది.