రియల్ మీ పాడ్ పేరుతో రియల్ మీ కంపెనీ.. తొలి ట్యాబ్లెట్ ను విడుదల చేసింది. భారత మార్కెట్ లోకి తన తొలి ట్యాబ్ ను రియల్ మీ రిలీజ్ చేసింది. స్లిమ్ డిజైన్ తో, క్వాడ్ స్పీకర్స్ తో రియల్ మీ పాడ్ విడుదలైంది. ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ80 ఎస్వోసీ ప్రాసెసర్ ఈ ట్యాబ్ లో ఉంటుంది. అలాగే.. డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ను ఈ ట్యాబ్ కలిగి ఉంటుంది.
రియల్ మీ పాడ్ 3 జీబీ ప్లస్ 32 జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న వైఫై వేరియంట్ ఫోన్ ధరను ఇండియాలో రూ.13,999 గా నిర్ణయించారు. ఒకవేళ వైఫై ప్లస్ 4జీ వేరియంట్ ధరను రూ.15,999గా నిర్ణయించారు. 4జీబీ ప్లస్ 64జీబీ మోడల్, వైఫై ప్లస్ 4జీ వేరియంట్ ధరను రూ.17,999గా నిర్ణయించారు. మూడు మోడల్స్.. గోల్డ్, గ్రే కలర్లలో లభించనున్నాయి.
వైఫై ప్లస్ 4జీ వేరియంట్ల ఫోన్లు మాత్రం సెప్టెంబర్ 16 నుంచి ఫ్లిప్ కార్ట్, రియల్ మీ.కామ్, ఆఫ్ లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానున్నాయి. వైఫై వేరియంట్ ఫోన్ సేల్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయో మాత్రం రియల్ మీ వెల్లడించలేదు.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుల ద్వారా లేదా ఈజీ ఈఎంఐ ద్వారా ఫోన్ ను కొనుగోలు చేస్తే రూ.2000 వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు కస్టమర్లు రూ.1000 డిస్కౌంట్ పొందొచ్చు.
రియల్ మీ పాడ్ తో పాటు.. రియల్ మీ బ్లూటూత్ స్పీకర్ ను కూడా రియల్ మీ విడుదల చేసింది. ఇందులో కబుల్, పాకెట్ బ్లూటూత్ స్పీకర్ ను రిలీజ్ చేసింది. కబుల్ బ్లూటూత్ స్పీకర్ ధర రూ.1799గా ఉండగా.. పాకెట్ బ్లూటూత్ స్పీకర్ ధర రూ.1099 గా ఉంది. సెప్టెంబర్ 15 నుంచి రెండు బ్లూటూత్ స్పీకర్ల సేల్స్ ప్రారంభం కానున్నాయి.
రియల్ మీ పాడ్.. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ తో నడుస్తుంది. 10.4 ఇంచ్ స్క్రీన్ డిస్ ప్లే, 82.5 బాడీ రేషియో, మీడియాటెక్ హిలియో జీ80 ఎస్వోసీ, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 8 ఎంపీ రేర్ కెమెరా, 105 డిగ్రీల అల్ట్రా వైడ్ లెన్స్, డాల్బీ అట్మాస్ డైనమిక్ స్పీకర్స్, హై రెస్ ఆడియో టెక్నాలజీస్, 7100 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 డబ్ల్యూ క్విక్ చార్జింగ్, రివర్స్ చార్జింగ్ లాంటి ఫీచర్లలో ఈ ఫోన్ విడుదల కానుంది.