న్యూఢిల్లీ : భారత్లో పోకో న్యూ బడ్జెట్ స్మార్ట్ఫోన్ను లాంఛ్ చేసింది. 6.5 ఇంచ్ డిస్ప్లే 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 8 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లతో పోకో సీ50ను కంపెనీ కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. భారత్లో రూ. 10,000లోపు అనువైన స్మార్ట్ఫోన్ కోరుకునేవారికి ఇది మెరుగైన ఛాయిస్గా ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో పోకో సీ50 ఇతర స్మార్ట్ఫోన్లకు దీటైన పోటీ ఇస్తుందని కంపెనీ భావిస్తోంది. భారత్లో తొలి ప్రోడక్ట్గా పోకో సీ50ను లాంఛ్ చేస్తున్నామని పోకో ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టాండన్ పేర్కొన్నారు. సీ సిరీస్ పోర్ట్ఫోలియో మెరుగైన డిస్ప్లే, సాఫ్ట్వేర్, గేమింగ్, కెమెరా ఎక్స్పీరియన్స్లను జోడిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటుందని అన్నారు.
పోకో సీ50 2జీబీ వేరియంట్ దేశీ మార్కెట్లో రూ .6499కు లభించనుండగా, 3జీబీ వేరియంట్ రూ .7299కి అందుబాటులో ఉంటుంది. రాయల్ బ్లూ, కంట్రీ గ్రీన్ కలర్స్లో పోకో సీ50 లభిస్తుందని, జనవరి 10 నుంచి ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుందని పోకో తెలిపింది.