జియోమీ తాజాగా స్మార్టర్ లివింగ్ 2022 ఈవెంట్ను నిర్వహించింది. ఈ ఈవెంట్లో ఎంఐ టీవీ 5 ఎక్స్ను లాంచ్ చేసింది. అలాగే.. ఎంఐ బాండ్ 6 ను కూడా రిలీజ్ చేసింది. గత సంవత్సరం రిలీజ్ అయిన ఎంఐ టీవీ 4ఎక్స్కు అప్గ్రేడే ఈ 5ఎక్స్ మోడల్.
40 వాట్స్ స్పీకర్, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో ఎంఐ టీవీ 5ఎక్స్ రానుంది. పాచ్వాల్ 4 ఇంటర్ఫేస్, గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ కోసం ఫార్ ఫీల్డ్ మైక్స్, హెచ్డీఎంఐ 2.1 పోర్ట్స్, రెండు యూఎస్బీ పోర్ట్స్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 64 బిట్ క్వాడ్ కోర్ ఏ55 సీపీయూ, మాలి జీ52 ఎంపీ2 జీపీయూ లాంటీ ఫీచర్లతో ఎంఐ టీవీ 5ఎక్స్, 96.6 పర్సంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, ప్రీమియం మెటాలిక్ బెజెల్స్, 4కే రిజల్యూషన్ డిస్ప్లే, రియాల్టీ ఫ్లో ఎంఈఎంసీ ఇంజన్ లాంటి ఫీచర్లతో ఈ టీవీ లాంచ్ అయింది.
43 ఇంచ్ మోడల్ ఎంఐ టీవీ 5ఎక్స్ ధర రూ.31,999 కాగా.. 50 ఇంచ్ మోడల్ ధర రూ. 41,999, 55 ఇంచ్ మోడల్ ధర రూ.47,999 గా నిర్ణయించారు. ఎంఐ టీవీ 5ఎక్స్ మోడల్ టీవీని ఎంఐ వెబ్సైట్, ఫ్లిప్కార్ట్, ఎంఐ హోమ్, ఎంఐ స్టూడియో, క్రోమా స్టోర్లో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి బుక్ చేసుకోవచ్చు.
లాంచింగ్ ఆఫర్ కింద హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా బుక్ చేసుకుంటే రూ.3000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది.