బెంగళూర్ : కరోనా మహమ్మారి కట్టడికి అమలు చేస్తున్న కఠిన నియంత్రణలతో జీవనాధారం కోల్పోయిన పేదలకు ఉచితంగా భోజనం అందించేందుకు బెంగళూర్ నగర పాలక సంస్థ (బీబీఎంపీ) కమ్యూనిటీ కిచెన్ ను ఏర్పాటు చేసింది. కొవిడ్-19 నేపథ్యంలో ఆదాయం కోల్పోయిన ప్రజలకు ఆసరాగా తాము కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేశామని ఇందిరా క్యాంటిన్ కిచెన్ ను బుధవారం సందర్శించిన బీబీఎంపీ చీఫ్ కమిషనర్ గౌరవ్ గుప్తా పేర్కొన్నారు.
ఇవి ఇప్పటికే పనిచేస్తుండగా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఉచితంగా ఆహారం సమకూరుస్తున్నామని చెప్పారు. ప్రతిరోజూ లక్ష మందికి అల్పాహారం, లక్ష లంచ్, లక్ష డిన్నర్ ప్యాక్ లు అందిస్తున్నామని చెప్పారు. మరోవైపు బెంగళూర్ కొవిడ్ క్యాపిటల్ గా మారడంతో మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన నియంత్రణలు అమలు చేస్తోంది.