న్యూఢిల్లీ : భారత్లో నెక్ట్స్ కే సిరీస్ ఫోన్ కే10 5జీని ఈ నెల 8న లాంఛ్ చేయనున్నట్టు ఒప్పో ప్రకటించింది. 5జీ కనెక్టివిటీతో పాటు పలు అప్గ్రేడ్లతో కస్టమర్ల ముందుకు రానుంది. ఒప్పో కే10 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్తో అందుబాటులో ఉంటుంది.
చైనీస్ వెర్షన్తో పోలిస్తే భారత్లో లేటెస్ట్ ఫోన్ పెర్ఫార్మెన్స్ తక్కవగా ఉంటుందని చిప్సెట్ వ్యత్యాసమే ఇందుకు కారణమని టెక్ నిపుణులు చెబుతున్నారు. కే10 5జీ ఫ్లాట్ డిజైన్తో పాటు వెనుక వైపు రెండు కెమెరాలను కలిగిఉంటుంది. బ్లాక్, బ్లూ కలర్స్లో ఒప్పో కే10 5జీ అందుబాటులోకి రానుంది.
ఒప్పో కే10 5జీ రూ 15,000 నుంచి భారత్లో లభించనుంది. లేటెస్ట్ ఒప్పో స్మార్టఫోన్ ఫ్లిప్కార్ట్, ఒప్పో ఆన్లైన్ స్టోర్లతో పాటు ప్రముఖ రిటైల్ అవుట్లెట్స్లో లభిస్తుంది. ఇక ప్రీమియం 5జీ చిప్సెట్తో లేటెస్ట్ స్మార్ట్ఫోన్ ఆకట్టుకుంటుందని, వర్చువల్ మెమరీ ఎక్స్పాన్షన ఫీచర్తో కస్టమర్ల ముందుకొస్తుందని ఒప్పో తెలిపింది. కే10 5జీ స్మార్ట్ఫోన్లో ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఫీచర్ ఉంటుందని ఒప్పో వెల్లడించింది.