న్యూఢిల్లీ : ఇండస్ట్రీ ఫస్ట్ టెక్నాలజీతో వన్ప్లస్ త్వరలో వన్ప్లస్ 11 కాన్సెప్స్ ఫోన్ను లాంఛ్ చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. స్పెయిన్లోని బార్సిలోనాలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ 2023)లో వన్ప్లస్ 11 కాన్సెప్ట్ను కంపెనీ ఆవిష్కరించనుంది. వన్ప్లస్ 11 5జీతో పాటు తొలి ట్యాబ్లెట్ వన్ప్లస్ ప్యాడ్ను లాంఛ్ చేసిన క్లౌడ్ 11 ఈవెంట్ వేదికగా కాన్సెప్ట్ ఫోన్ వివరాలు వెల్లడించింది. వన్ప్లస్ ఎక్ట్సీరియర్ డిజైన్పై ఫోకస్ పెడుతూ 2020లో వన్ప్లస్ 8టీ కాన్సెప్ట్ను ప్రవేశపెట్టింది.
ఇక ఎండబ్ల్యూసీ 2023 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకూ జరగనుంది. ఎండబ్ల్యూసీ 2023 వేదికగా ఇమేజినేటివ్ డిజైన్, ఇండస్ర్టీ ఫస్ట్ టెక్నాలజీతో వన్ప్లస్ 11 కాన్సెప్ట్ను లాంఛ్ చేస్తామని వన్ప్లస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎండబ్ల్యూసీ 2023లో తమ ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్స్లో కాన్సెప్ట్ ఫోన్ తమ బ్రాండ్ లైనప్లో ప్రీమియం ఫోన్గా నిలుస్తుందని తెలిపింది. ఈ ఫోన్ విషయంలో బాడీ కలర్ మారేలా యూనిక్ టెక్నాలజీని వన్ప్లస్ వాడుతుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
కెమెరా లెన్స్ను హైడ్ చేసేలా ఎలక్ట్రోక్రామిక్ గ్లాస్ ప్యానెల్తో కూడిన కెమెరా మాడ్యూల్పై కంపెనీ కసరత్తు సాగిస్తోంది. వన్ప్లస్ 11 కాన్సెప్ట్తో పాటు ఇదే వేదికపై వన్ప్లస్ తన తొలి ఫోల్డింగ్ స్మార్ట్ఫోన్ను లాంఛ్ చేయవచ్చని భావిస్తున్నారు. ఒప్పో ఫైండ్ ఎన్ సిరీస్ స్ఫూర్తితో ఫోల్డబుల్ ఫోన్పై వన్ప్లస్ కసరత్తు సాగిస్తోందని సమాచారం. శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్కు దీటుగా కంపెనీ వన్ప్లస్ ఫ్లిప్నూ లాంఛ్ చేయవచ్చని భావిస్తున్నారు.