న్యూఢిల్లీ : భారత్లో ఈనెల 16న ఒన్ప్లస్ ఆర్టీ స్మార్ట్ఫోన్ లాంఛ్ కానుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 888 చిప్సెట్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరాలతో 8జీబీ ర్యాం, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్స్తో లభించే ఈ డివైజ్ రూ 37,999 నుంచి రూ 39,900కు అందుబాటులో ఉంటుంది.
చైనాలో లాంఛ్ అయిన ఒన్ప్లస్ 9ఆర్టీ రీబ్రాండెడ్ వెర్షన్గా వస్తున్న ఒన్ప్లస్ ఆర్టీ దాదాపు అవే స్పెసిఫికేషన్లతో దేశీ కస్టమర్ల ముందుకు రానుంది. ఒన్ప్లస్ ఆర్టీ 6.62 ఇంచ్ అమోల్డ్ ప్యానెల్తో 4500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది. త్వరలోనే ఒన్ప్లస్ ఆర్టీ భారత్ లాంఛ్ వివరాలు, ధర, పీచర్ల గురించి కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది.