న్యూఢిల్లీ : అత్యాధునిక ఫీచర్లతో ఆకట్టుకునే ధరలో వన్ప్లస్ 11 5జీ ఫిబ్రవరి 7న భారత్ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. లాంఛ్కు ముందు లేటెస్ట్ వన్ప్లస్ స్మార్ట్ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. టిప్స్టర్ యోగేష్ బ్రర్ లీక్స్ ప్రకారం దేశీ మార్కెట్లో వన్ప్లస్ 11 5జీ స్మార్ట్ఫోన్ రూ. 55,000 నుంచి రూ. 65,000 మధ్య అందుబాటులో ఉంటుంది.
వన్ప్లస్ 10 ప్రొ లాంఛ్ సమయంలో ఆ డివైజ్ ధరతో పోలిస్తే వన్ప్లస్ 11 5జీ ధర తక్కువగా ఉండటం గమనార్హం. వన్ప్లస్ 10 ప్రొ ధరను ఇటీవల వన్ప్లస్ తగ్గించడంతో ప్రస్తుతం ఈ స్మార్ట్ఫోన్ రూ . 61,999 నుంచి అందుబాటులో ఉంది. ఇక ఫిబ్రవరిలో వన్ప్లస్ 11 5జీతో పాటు వన్ప్లస్ 11 ఆర్ను కూడా లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టిందని ఇదే లీక్ వెల్లడించింది.
వనప్లస్ 10 ఆర్తో పోలిస్తే వన్ప్లస్ 11 ఆర్ రూ. 3000 నుంచి రూ .5000 వరకూ అధికంగా ఉంటుందని లీక్స్టర్ తెలిపారు. ఇక వన్ప్లస్ 11 5జీ 6.7 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్తో కస్టమర్ల ముందుకు రానుంది. వన్ప్లస్ లేటెస్ట్ ఫోన్ గ్రావిటీ సెన్సర్, డిస్టన్స్ సెన్సర్, లైట్ సెన్సర్, ఫేస్ అన్లాక్ ఫీచర్ వంటి ఫీచర్లను కలిగిఉంటుంది. వన్ప్లస్ 11 5జీ క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్తో కస్టమర్ల ముందుకొస్తుంది. అప్కమింగ్ వన్ప్లస్ ఫోన్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది.