న్యూఢిల్లీ : లేటెస్ట్ ఫీచర్లతో వన్ప్లస్ 11 5జీ చైనాలో లాంఛ్ అయింది. భారత్ సహా ఇతర మార్కెట్లలో ఫిబ్రవరి 7న లాంఛ్ కానున్న వన్ప్లస్ 11 5జీ న్యూ క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ ప్రాసెసర్తో కస్టమర్ల ముందుకు రానుంది. వన్ప్లస్ 11 5జీ 6.7 ఇంచ్ క్యూహెచ్డీ+ ఈ4 ఓఎల్ఈడీ డిస్ప్లేను కలిగిఉంటుంది.
ఈ స్మార్ట్ఫోన్ స్టాండర్డ్ పంచ్ హోల్ డిస్ప్లే డిజైన్తో ఆకట్టుకుంటుంది. మెరుగైన పెర్ఫామెన్స్ ఆఫర్ చేసేందుకు ఈ ఫోన్లో లేటెస్ట్ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ వెర్షన్ను ఉపయోగించారు. వన్ప్లస్ 100డబ్ల్యూ ఫాస్ట్చార్జింగ్ సపోర్ట్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. వెనుకభాగంలో వన్ప్లస్ 11 ట్రిపుల్ కెమెరా సెటప్తో కస్టమర్ల ముందుకు రానుంది.
ఓఐఎస్ సపోర్ట్తో కూడిన 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్90 సెన్సర్ను కలిగిఉంది. ఇక 48 ఎంపీ సోనీ ఐఎంఎక్స్581 అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్, 32 ఎంపీ సోనీ ఐఎంఎక్స్709 2x టెలిఫోటో కెమెరా ఆకట్టుకుంటాయి. ముందుభాగంలో సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ఉండగా వన్ప్లస్ 11 5జీ రూ . 48,000 నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది.