న్యూఢిల్లీ : వన్ప్లస్ 10టీ 5జీ ఇండియా లాంఛ్ డేట్పై స్పష్టత వచ్చింది. జులై 25 నుంచి ఆగస్ట్ 1 మధ్య వన్ప్లస్ 10టీ 5జీ లాంఛ్ కానుందని ప్రైస్బాబా రిపోర్ట్ వెల్లడించింది. భారత్లో ఆగస్ట్ తొలి వారంలో లేటెస్ట్ వన్ప్లస్ స్మార్ట్ఫోన్ సేల్స్ షురూ అవుతాయని ఈ రిపోర్ట్ పేర్కొంది.
వన్ప్లస్ 10టీ 5జీ భారత్లో అమెజాన్, వన్ప్లస్ అధికారిక వెబ్సైట్, వన్ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. వన్ప్లస్ 10టీ 5జీ ఫీచర్లు గతంలో లీకయ్యాయి. ఈ స్మార్ట్ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్తో రానుంది. 50ఎంపీ మెయిన్ కెమెరా సెన్సర్, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ మ్యాక్రో సెన్సర్లతో ఆకట్టుకోనుంది.
ముందుభాగంలో ఫ్లాట్ స్క్రీన్, 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లే, 16ఎంపీ ఫ్రంట్ కెమరా సెన్సర్ వంటి ఫీచర్లను కలిగిఉంది. వన్ప్లస్ 10టీ 5జీ క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీ చిప్సెట్, 150డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో 4800ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో రానుంది. ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుటాఫ్ ది బాక్స్ ఓఎస్పై రన్ అవుతుంది. వన్ప్లస్ 10టీ 5జీ షియామి 12 ప్రొ, ఐఫోన్ 12, వివో ఎక్స్80, రియల్మి జీటీ 2ప్రొ, మోటో ఎడ్జ్ 30 ప్రొ వంటి ప్రీమియం ఫోన్లకు దీటైన పోటీ ఇవ్వనుంది.