న్యూఢిల్లీ : భారత్లో మరో పదిరోజుల్లో జులై 11న నథింగ్ ఫోన్ (2)ను కంపెనీ లాంఛ్ చేయనుంది. అధికారిక లాంఛ్కు ముందు ఈ హాట్ డివైజ్ (Nothing Phone (2)) గురించి కంపెనీ పలు వివరాలను నిర్ధారించింది. నథింగ్ లేటెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్ను ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. భారత్లో రూ. 40,000లోపు లభించే వన్ప్లస్ 11ఆర్ వంటి ఫోన్లలో వాడే టాపెండ్ క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8జెన్ 1 చిప్సెట్తో నథింగ్ ఫోన్ (2) కస్టమర్ల ముందుకు రానుంది.
అప్కమింగ్ నథింగ్ ఫోన్ స్టాండర్డ్ పంచ్ హోల్ డిస్ప్లే డిజైన్తో ఆకట్టుకోనుంది. కంపెనీ రిలీజ్ చేసిన టీజర్ల ప్రకారం నథింగ్ ఫోన్ (2) న్యూ లైట్, సౌండ్ సెటప్తో సెమీ ట్రాన్స్పరెంట్ బ్యాక్ ప్యానెల్ డిజైన్తో రానుంది. దీంతో ఎల్ఈడీ స్ట్రిప్, వైర్లెస్ చార్జింగ్ కాయిల్లో మార్పులను చూడొచ్చు. ఇక 6.7 ఇంచ్ డిస్ప్లేతో ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్తో నథింగ్ ఫోన్ (2) కస్టమర్ల ముందుకు రానుంది.
నథింగ్ ఫోన్ 1 తరహాలోనే లేటెస్ట్ స్మార్ట్ఫోన్లోనూ ముందు భాగంలో ఓఎల్ఈడీ ప్యానెల్ను కంపెనీ ఆఫర్ చేయనుంది. అప్కమింగ్ నథింగ్ ఫోన్ (2) అండ్రాయిడ్ 13 అవుటాఫ్ ది బాక్స్ ఓఎస్పై రన్ అవుతుంది. ఇక నథింగ్ ఫోన్ (2) ఫ్లిప్కార్ట్లో ప్రీ ఆర్డర్ కోసం సిద్ధంగా ఉంది. ప్రీ ఆర్డర్ ఈవెంట్లో సేల్ ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది.
Read More :
Tech Tips | ఫోన్ మారుస్తున్నారా.. ఇలా చేయడం తప్పనిసరి!!