న్యూఢిల్లీ : భారత్లో న్యూ కలర్ఫిట్ ప్రొ 5 సిరీస్ను నాయిస్ లాంఛ్ చేసింది. లేటెస్ట్ నాయిస్ స్మార్ట్వాచ్లు రూ. 3,999 నుంచి అందుబాటులో ఉంటాయి. స్టాండర్డ్ నాయిస్ కలర్ఫిట్ ప్రొ 5తో (Noise ColorFit Pro 5 series) పాటు నాయిస్ కలర్ఫిట్ ప్రొ 5 మ్యాక్స్ పేరుతో మోర్ ప్రీమియం వెర్షన్ను నాయిస్ లాంఛ్ చేసింది. ఇక లేటెస్ట్ నాయిస్ కలర్ఫిట్ ప్రొ 5 సిరీస్ భారీ డిస్ప్లే, 100 స్పోర్ట్ మోడ్స్తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఎస్ఓఎస్ కనెక్టివిటీ, ఇతర హెల్త్ ఫీచర్లను లేటెస్ట్ సిరీస్లో యూజర్లకు నాయిస్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
భారత్లో నాయిస్ కలర్ఫిట్ ప్రొ 5 రూ. 3999 నుంచి ప్రారంభమవనుండగా, కలర్ఫిట్ ప్రో 5 మ్యాక్స్ బేస్ వెర్షన్స్ రూ. 4999కు లభిస్తాయి. ఇక రూ. 4999, రూ. 5999 ధరలో ఎలైట్ ఎడిషన్స్ను కూడా కంపెనీ ప్రకటించింది. ఈ ప్రోడక్ట్స్ను కస్టమర్లు గోనాయిస్.కాం, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్ర ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఇక నాయిస్ కలర్ఫిట్ ప్రొ 5 ఫీచర్ల విషయానికి వస్తే 1.85 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లే బ్రైటర్ స్క్రీన్స్తో ఈ సిరీస్ ఆకట్టుకోనుండగా, మ్యాక్స్ వేరియంట్ 1.96 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో కస్టమర్ల ముందుకొచ్చింది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం న్యూ స్మార్ట్వాచ్లు టిపికల్ ఐపీ68 రేటింగ్ కలిగిఉన్నాయి. ఇక నాయిస్ కలర్ఫిట్ ప్రొ 5 వాచ్ ఒకసారి చార్జ్ చేస్తే ఏడు రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఈ డివైజ్లు ఎస్ఓఎస్, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ కలిగిఉన్నాయి.
Read More :
OnePlus 12 | డిసెంబర్ 4న వన్ప్లస్ 12 గ్రాండ్ ఎంట్రీ..హాట్ డివైజ్ ఫీచర్లివే..!