న్యూఢిల్లీ : మోటో జీ82 5జీ ఫోన్ జూన్ 7న భారత్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. న్యూ 5జీ స్మార్ట్ఫోన్ ఇండియా లాంఛ్ డేట్ను మోటోరోలా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. లాంఛ్కు ముందు లేటెస్ట్ స్మార్ట్ఫోన్ కీలక ఫీచర్లను వెల్లడించింది. మోటో జీ82 5జీ ఫోన్ ఎల్ఈడీ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ ప్రైమరీ సెన్సర్తో కూడిన ట్రిపుల్ రియర్ కెమరా సిస్టమ్ వంటి హాట్ ఫీచర్లతో కస్టమర్ల ముందుకు రానుంది.
లేటెస్ట్ మోటో జీ82 5జీ ఫోన్ భారత్లో దాదాపు రూ 26,500కు అందుబాటులో ఉండనుంది. ఈకామర్స్ దిగ్గజం ప్లిఫ్కార్ట్ సైట్లోనూ మోటో జీ82 లభిస్తుంది. న్యూ మోటో ఫోన్ గ్రే, వైట్ కలర్స్లో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కాం స్నాప్డ్రాగన్ 695 ఎస్ఓఎస్ 5జీ చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుంది. 30డబ్ల్యూ టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేసేలా 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. డాల్బీ అట్మాస్కు సపోర్ట్ చేసే స్టీరియో స్పీకర్స్ ఈ ఫోన్లో పొందుపరిచారు.