న్యూఢిల్లీ : ఆన్లైన్ అడ్డాగా సైబర్ నేరగాళ్లు (WhatsApp scam) చెలరేగుతూనే ఉన్నారు. పార్ట్టైం జాబ్ ఆఫర్లు, వర్క్ ఫ్రం హోం పేరుతో అమాయకుల నుంచి అందినకాడికి కొట్టేస్తున్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్లో ఓ వ్యక్తిని నకిలీ జాబ్ ఆఫర్తో రూ. 13 లక్షలకు మోసం చేశారు. సింగనల్లూర్కు సమీపంలోని ఉప్పిలిపాళ్యానికి చెందిన 22 ఏండ్ల డొమినిక్ సవియో చెట్టియార్ను సైబర్ నేరగాళ్లు నిండా ముంచారు.
వాట్సాప్ ద్వారా చెట్టియార్కు పరిచయమైన స్కామర్ ఆన్లైన్ టాస్క్ల ద్వారా అదనపు ఆదాయం ఆర్జించవచ్చని మే 9న మెసేజ్ చేశాడు. ఆపై టాస్క్లను పూర్తి చేయడంతో కొద్దిపాటి రిటన్స్ వచ్చాయని, దీంతో అధిక రిటన్స్ వస్తాయని ఆశ చూపి పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని స్కామర్లు మభ్యపెట్టారు. వారి మాటలు నమ్మిన బాధితుడు పలు లావాదేవీల్లో రూ. 12.98 లక్షలను వివిధ ఖాతాల్లోకి బదలాయించాడు.
డబ్బు మొత్తం అందగానే నిందితుడు అన్ని కాంటాక్టులను బ్లాక్ చేయడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద నెంబర్ల నుంచి వచ్చే కాల్స్కు స్పందించవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read More