న్యూఢిల్లీ : ఆర్ధిక మందగమనం వెంటాడుతుండటంతో పలు కంపెనీల్లో మాస్ లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. క్రిప్టోకరెన్సీ ప్లాట్ఫాం కాయిన్బేస్ తాజాగా 950 మంది ఉద్యోగులపై వేటు వేసింది. నిర్వహణ వ్యయాలను తగ్గించుకునేందుకు సిబ్బందిలో 20 శాతం మందిని తొలగిస్తున్నట్టు పేర్కొంది.
నిర్వహణ వ్యయాలను తగ్గించేందుకు 950 మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పించాలనే కఠిన నిర్ణయం తీసుకున్నామని కాయిన్బేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రైన్ ఆర్మ్స్ట్రాంగ్ కంపెనీ అధికారిక బ్లాగ్ పోస్ట్లో పేర్కొన్నారు. కంపెనీకి మెరుగైన మూలధనం ఉందని, క్రిప్టో ఎక్కడకీ పోదని బ్లాగ్ పోస్ట్లో రాసుకొచ్చారు.
క్రిప్టో మార్కెట్లో ఆటుపోట్లను తట్టుకోవడంతో పాటు ముందుకొచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు నిర్వహణా సామర్ధ్యం ఉండాలని అన్నారు. నిర్వహణ వ్యయాలను తగ్గించే క్రమంలో 950 మంది ఉద్యోగులను తొలగించాలనే సంక్లిష్ట నిర్ణయం తీసుకున్నానని బ్లాగ్ పోస్ట్లో ఆర్మ్స్ట్రాంగ్ లేఆఫ్స్ బాంబు పేల్చారు.