ముంబై : టీసీఎస్ సీఈవో (TCS ) రాజేష్ గోపీనాధన్ స్ధానంలో నూతన సీఈఓగా నియమితులైన కే. కృతివాసన్ త్వరలో దేశీ ఐటీ దిగ్గజ సారధ్య బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నో సవాళ్లతో కూడిన ఈ పదవి కంటే తనకు సొంత నగరం చెన్నై నుంచి ముంబైకి మారాల్సి రావడమే పెద్ద సవాల్ అని కృతివాసన్ చెప్పుకొచ్చారు. టీసీఎస్ సీఈఓ కావడం కంటే సొంత నగరం చెన్నై నుంచి ముంబైకి మారడమే కష్టమని మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు.
తనకు చెన్నైను వీడి ముంబైకి మారడమే కష్టమైన నిర్ణయమని చెప్పారు. 2017 నుంచి దాదాపు రెండు దశాబ్ధాలకు పైగా టీసీఎస్ సీఈఓగా రాజేష్ గోపీనాధన్ పనిచేయగా ఇటీవల ఆయన రాజీనామా అనంతరం నూతన సీఈఓగా కే. కృతివాసన్ నియమించినట్టు టీసీఎస్ ప్రకటించింది. మార్చి 16 నుంచి కృతివాసన్ నియమాకం అమల్లోకి వస్తుందని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో టీసీఎస్ తెలిపింది.
ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ టీసీఎస్ మాజీ సీఈఓ రాజేష్ గోపీనాధన్ కంపెనీలో కొనసాగుతారని పేర్కొంది. ఇక కృతివాసన్ 1989లో టీసీఎస్లో చేరిన అనంతరం కంపెనీలో డెలివరీ, రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సేల్స్ సహా పలు విభాగాల్లో పనిచేశారు. టీసీఎస్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఏజీ పర్యవేక్షక బోర్డులోనూ ఆయన సేవలందించారు.
Read More :