ఢిల్లీ ,జూలై : కరోనా మహమ్మారి కారణంగా చంద్రయాన్ -3 ప్రయోగాలు నిలిచిపోవడంతో చంద్రయాన్-3 ప్రయోగం మరింత ఆలస్యం కానున్నదని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ శాఖ మంత్రి డా.జితేంద్ర సింగ్ వెల్లడించారు. 2022 మూడవ త్రైమాసికంలో చంద్రయాన్ -3 మిషన్ను చంద్రుడి మీదకు ప్రయోగించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో ఇస్రో ఉద్యోగులు ఇంటి నుంచి విధులు నిర్వహించారు. అన్లాక్ తర్వాత నుంచి చంద్రయాన్-3 పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. అవన్నీ త్వరలో పూర్తికానున్నాయని ఆయన వెల్లడించారు. “చంద్రయాన్ -3 ను విజయవంతంగా ప్రయోగించడానికి అవసరమైన పరీక్షలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.”
చంద్రయాన్ -3 ఈ ఏడాదిలో ప్రారంభించాల్సి ఉన్నది. కోవిడ్ -19 లాక్డౌన్ కారణంగా భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అనేక ప్రాజెక్టులను ప్రభావితం చేసింది.”మేము దానిపై పని చేస్తున్నాము. చంద్రయాన్ -2 సమయంలో ప్రయోగించిన కక్ష్య చంద్రయాన్ -3 కోసం ఉపయోగించనున్నాం. అందుకోసం ప్రత్యేక టీమ్ పనిచేస్తున్నదని, 2022 లో చంద్రయాన్-3 ప్రయోగం ఉంటుందని” ఇస్రో చీఫ్ కె శివన్ చెప్పారు. ఇస్రోకు చంద్రయాన్ -3 చాలా కీలకం ఇది భారతదేశ సామర్థ్యాలను నిరూపించనున్నాడని ఆయన పేర్కొన్నారు.