న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు సమయానికి ఇన్సులిన్ను తీసుకోవాలి. అయితే, దీనిని ఫ్రిజ్లో నిల్వ చేయాల్సి ఉంటుంది. లేకపోతే పాడవుతుంది. డయాబెటిక్ రోగులు ఎక్కడికైనా వెళ్తే వెంట ఇన్సులిన్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఫ్రిజ్ సౌకర్యం ఉండకపోవచ్చు. ఇదో పెద్ద సమస్య. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫ్రిజ్లో నిల్వ చేయాల్సిన అవసరం లేని ఇన్సులిన్ను శాస్త్రవేత్తలు తయారుచేశారు. కోల్కతాలోని బోస్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ శాస్త్రవేత్తలు, హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) శాస్త్రవేత్తలు ఇన్సులిన్లో నాలుగు అమైనో ఆమ్లాల పప్టైడ్లను కలిపి ఈ ఇన్సులిన్ను అభివృద్ధి చేశారు. ఇది 65 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా పాడవదు. ‘ఇన్సులిన్ను ఇప్పటివరకు 4 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉండేది. ఇకపై ఆ అవసరం లేదు’ అని బోస్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ శుభ్రాంశు చటర్జీ అన్నారు. ఈ పరిశోధనకు భారత శాస్త్ర, సాంకేతిక విభాగం, సీఎస్ఐఆర్ నిధులు సమకూర్చాయి.