భూకంపం అనేది ప్రకృతి విపత్తు. అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా సంభవిస్తుందో ఎవ్వరికీ తెలియదు. భూకంపం ఒక్కసారి వచ్చిందంటే.. తీవ్రస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుంది. అందుకే.. భూకంపం అంటేనే ప్రజలు హడలిపోతారు.
అయితే.. భూకంపాన్ని ముందే గుర్తించలేమా? పలానా ఏరియాలో భూకంపం వస్తుందని ముందే పసిగట్టలేమా? అంటే.. ఇప్పుడు అవును అనే చెప్పొచ్చు. నిజానికి.. భూకంపాన్ని ముందే గుర్తించే విషయంపై చాలా రీసెర్ఛ్లు జరిగాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఐఐటీ రూర్కీ… భూకంపాన్ని ముందే గుర్తించే మొబైల్ యాప్ను డెవలప్ చేసింది.
ఉత్తరాఖండ్ భూకంప్ అలర్ట్ అనే పేరు డెవలప్ చేసిన ఈ యాప్ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ తాజాగా లాంచ్ చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎక్కువగా భూకంపాలు వస్తున్నందున్న.. భూకంపాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతం అవడం వల్ల.. భూకంపాలను ముందే గుర్తించి.. సహాయక చర్యలను ముందే ప్రారంభించే ఉద్దేశంతోనే ఈ యాప్ను అభివృద్ధి చేయించామని ముఖ్యమంత్రి పుష్కర్ వెల్లడించారు.
ఈ యాప్.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ను ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ స్పాన్సర్ చేసింది.
భూకంపాల గురించి ముందే అలర్ట్ ఇచ్చేలా ఇప్పటి వరకు ఎటువంటి టెక్నాలజీ రాలేదు. మొట్టమొదటిసారిగా వచ్చిన యాప్ ఇదే. ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్న వాళ్లకు ఎర్త్క్వేక్ ఎర్లీ వార్నింగ్ పేరుతో రియల్ టైమ్ ఎర్త్క్వేక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ల రూపంలో అందిస్తారు. సీస్మిక్ వేవ్స్ వేగం ఆధారంగా ముందే.. ఏ ప్రాంతంలో భూకంపం వస్తుందో ఈ యాప్ పసిగడుతుంది. దీంతో వెంటనే ప్రజలు అప్రమత్తమై ఆ చోటును వదిలి దూరంగా వెళ్లి ప్రాణాలను కాపాడుకోవచ్చు.