న్యూఢిల్లీ : ఆల్ న్యూ వాచ్ జీటీ రన్నర్ను హువీ చైనా మార్కెట్లో లాంఛ్ చేసింది. ప్రీ ఆర్డర్స్ అందుబాటులో ఉండగా నవంబర్ 26 నుంచి సేల్ ప్రారంభమవనుంది. ఈ స్మార్ట్ వాచ్ బరువు 38.5 గ్రాములు కాగా హువీ వాచ్ జీటీ రన్నర్ 46ఎంఎం సర్క్యులర్ డయల్, 1.3 ఇంచ్ డిస్ప్లేతో అందుబాటులో ఉంటుంది.
హార్మనీ ఓఎస్పై నడిచే హువీ జీటీ రన్నర్ ధర రూ 25,500. ఈ వాచ్ హార్ట్రేట్, అల్టిట్యూడ్, రియల్ టైమ్ వెదర్ను ట్రాక్ చేసే ఫీచర్లను కలిగింది. ఇక న్యూ హువీ స్మార్ట్వాచ్ భారత్ మార్కెట్లో ఎప్పటినుంచి అందుబాటులో ఉంటుందనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.