న్యూఢిల్లీ : గూగుల్ పిక్సెల్ 6ఏకు కొనసాగింపుగా పిక్సెల్ 7ఏ లాంఛ్కు గూగుల్ సన్నాహాలు ముమ్మరం చేసింది. భారత్లో గూగుల్ పిక్సెల్ 7ఏ రూ 40,000కుపైగా అందుబాటులో ఉండనుంది. పిక్సెల్ 7ఏ లాంఛ్కు ముందు లేటెస్ట్ స్మార్ట్ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి. పిక్సెల్ 6ఏతో పోలిస్తే హైరిఫ్రెష్ స్క్రీన్, అప్గ్రేడెడ్ రియర్ కెమెరా సిస్టంతో ఈ స్మార్ట్ఫోన్ కస్టమర్ల ముందుకు రానుంది.
కోడ్నేమ్ లింక్స్ పేరుతో గూగుల్ పిక్సెల్ 7ఏను డెవలప్ చేస్తోంది. ఈ ఫోన్ను ఫ్లాగ్సిప్ ప్రీమియం తరహాలో కాకుండా మిడ్రేంజ్ స్మార్ట్ఫోన్గా కస్టమర్ల ముందుకు తీసుకురానున్నారని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇక పిక్సెల్ 7ఏ ఐఎంఎక్స్787 అల్ట్రా వైడ్ కెమెరా సెన్సర్, సోనీ ఐఎంఎక్స్712 అల్ట్రా వైడ్ కెమెరా సెన్సర్తో ముందుకురానుంది.
స్మూత్ స్క్రోలింగ్ అనుభూతి కోసం పిక్సెల్ 7ఏ 90హెచ్జడ్ డిస్ప్లేతో రానుంది. వైర్సెల్ చార్జింగ్ను గూగుల్ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ సపోర్ట్ చేస్తుంది. హై రిఫ్రెష్ రేట్, వైర్లెస్ చార్జింగ్, బ్రాండ్ న్యూ కెమెరా సెన్సర్, మెరుగైన సాఫ్ట్వేర్తో రానున్న గూగుల్ లేటెస్ట్ ఫోన్ కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఇక భారత్లో గూగుల్ పిక్సెల్ 7ఏ రూ 40,000 నుంచి రూ 50,000 మధ్య అందుబాటులో ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.