న్యూఢిల్లీ : శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్కు దీటుగా పిక్సెల్ ఫోల్డ్ను (Google Pixel Fold) లాంఛ్ చేసేందుకు గూగుల్ సన్నాహాలు చేపట్టింది. గూగుల్ ఐఓ 2023 వేదికగా గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ లాంఛనంగా లాంఛ్ కానుండగా, జూన్లో అధికారిక లాంఛ్ ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
పిక్సెల్ ఫోల్డ్ రూ. 1.40 లక్షలకు అందుబాటులో ఉంటుందని అంచనా. శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 4 ధర రూ. 1,54,999 కావడంతో పిక్సెల్ ఫోల్డ్ శాంసంగ్ ఫోల్డ్కు దీటైన పోటీ ఇవ్వనుంది. పిక్సెల్ ఫోల్డ్ స్క్వేరిష్ డిస్ప్లేతో గూగుల్ ప్రొప్రైటరీ టెన్సర్ జీ2 ఎస్ఓసీ చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుంది. కవర్ డిస్ప్లే 5.8 ఇంచ్ కాగా, మెయిన్ ట్యాబ్లెట్ సైజ్ స్క్రీన్ 7.6 ఇంచ్ వ్యూయింగ్ ఏరియాతో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
పిక్సెల్ ఫోల్డ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 4కు పోటీ ఇవ్వనుండగా ఆండ్రాయిడ్ ఫోన్లపై సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ను మెరుగుపరిచేందుకు శాంసంగ్, గూగుల్ కసరత్తు సాగిస్తున్నాయి. పిక్సెల్ ఫోల్డ్ లాంఛ్ నేపధ్యంలో ఈ డివైజ్ను భారత్లో ప్రవేశపెట్టడంపై గూగుల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం గూగుల్ కరెంట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ పిక్సెల్ 7 సిరీస్ భారత్లో అందుబాటులో ఉంది.
Read More
Xiaomi 13 Ultra | మార్కెట్లోకి షియోమీ 13 ఆల్ట్రా.. ఇవీ స్పెషిఫికేషన్స్..!