Sundar Pichai | సెర్చింజన్ `గూగుల్` పొదుపు చర్యలు చేపట్టేందుకు సన్నద్ధం అవుతున్నది. సంస్థ పనితీరు కనీసం 20 శాతం సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉద్యోగుల తొలగింపునకు సన్నాహాలు చేస్తున్నది. గతంలో తక్కువ వనరులు ఉన్నప్పుడు సిబ్బంది ప్రాధాన్యాల వర్గీకరణ ద్వారా పనులు పూర్తి చేశామని గూగుల్-అల్పాబెట్ సీఈవో సుందర్ పిచ్చాయ్ చెప్పారు. ఫలితాలు ప్రతిభావంతంగా ఉండేవని తెలిపారు. ఉద్యోగులు పెరగడం వల్లే గూగుల్లో పనితీరు నెమ్మదించిందని మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ సంగతి చెప్పారు.
మున్ముందు కొన్నేండ్లలో పలు ఆర్థిక సవాళ్లు, భారీగా నియామక ప్రణాళిక ఉందని సుందర్ పిచ్చాయ్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థక అనిశ్చితితోపాటు వాణిజ్య ప్రకటనలతో ఆదాయం తగ్గడంతో కంపెనీని సమర్ధవంతంగా తీర్చిదిద్దడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.
అందులో భాగంగా సిబ్బందిని తొలగించడంతోపాటు యూ-ట్యూబ్ మ్యూజిక్, గూగుల్ ప్లే మ్యూజిక్ వంటి విబాగాలను ఒకే ప్లాట్ఫామ్ కిందకు తేవడంతో సామర్థ్యం పెంచొచ్చునని సుందర్ పిచ్చాయ్ చెప్పారు. కొన్ని విభాగాల్లో నిర్ణాయక స్థాయి సిబ్బంది ముగ్గురు ఉంటే దాన్ని ఇద్దరూ, ఒకరికి తగిస్తే పని తీరు 20 శాతం మెరుగవుతుందన్నారు.