న్యూఢిల్లీ : టెక్ ప్రపంచంలో మాస్ లేఆఫ్స్ (Layoffs) కొనసాగుతున్నాయి. మాంద్యం భయాలు, ఆర్ధిక మందగమనంతో పలు కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఇక మైక్రోసాఫ్ట్కు చెందిన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ గిట్హబ్ భారత్లో తన ఇంజనీరింగ్ టీం అంతటినీ విధుల నుంచి తొలగించింది.
లేఆఫ్స్తో భారత్లో గిట్హబ్ ఇండియన్ ఆపరేషన్స్లో పనిచేసే 142 మంది ఉద్యోగులు తమ కొలువులను కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోయిన వారందరికీ రెండు నెలల వేతనంతో కూడిన పరిహార ప్యాకేజ్ వర్తింపచేస్తామని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగుల సంఖ్యను కుదించాలని ఫిబ్రవరిలో చేపట్టిన పునర్వ్యవస్ధీకరణ ప్రణాళికలో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని గిట్హబ్ ఓ ప్రకటనలో పేర్కొంది.
లేఆఫ్స్కు సంబంధించి కంపెనీ సీఈవో థామస్ డోమ్కి ఉద్యోగులకు ఈమెయిల్ పంపుతూ కంపెనీ చేపట్టిన చర్యలను సమర్ధించారు. కొందరు ఉద్యోగులను తప్పించడం వంటి కఠిన చర్యలు చేపట్టాల్సి వచ్చిందని, దీర్ఘకాలిక వ్యూహాల్లో భాగంగా కంపెనీ పెట్టుబడుల సామర్ధ్యాన్ని కాపాడుకునేందుకు, సంస్ధ బలోపేతానికి ఈ చర్యలు చేపట్టక తప్పలేదని పేర్కొన్నారు.
Read More
ChatGPT | చాట్జీపీటీతో ఊడనున్న కొలువు ఇదే..: ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ వెల్లడి