న్యూఢిల్లీ : భారత్లో గ్రోక్ ఏఐ లాంచ్కు ఎలన్ మస్క్ (Elon Musk) సారధ్యంలోని ఎక్స్ సన్నద్ధమైంది. 45 దేశాలతో పాటు భారత్లో తన జనరేటివ్ ఏఐ చాట్బాట్ గ్రోక్ ఏఐని ప్రవేశపెట్టేందుకు ఎలన్ మస్క్కు చెందిన కృత్రిమ మేధ కంపెనీ ఎక్స్ఏఐ కసరత్తు ముమ్మరం చేయనుంది. పాకిస్తాన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్, శ్రీలంక వంటి పలు దేశాల్లో గ్రోక్ ఏఐని ఎక్స్ఏఐ లాంఛ్ చేయనుంది. తమ న్యూ ఏఐ చాట్బాట్ అమెరికాలో ఎక్స్ ప్రీమియం+ సబ్స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
గ్రోక్ ఏఐ ఎక్స్ వేదిక నుంచి రియల్టైం రియల్ టైం ఇన్ఫర్మేషన్ పొందుతుంది. ఇది గ్రోక్ఏఐ తన విజ్ఞానం తాజాగా, ఆయా విషయాల పరంగా ఉండేందుకు కీలకంగా వ్యవహరిస్తుంది. ఇక చాట్జీపీటీ, గూగుల్ బార్డ్లకు దీటుగా తన ప్రత్యర్ధులు తరచూ తిరస్కరించే స్పైసీ ప్రశ్నలు, సబ్జెక్ట్స్ను కూడా గ్రోక్ ఏఐ చాట్బాట్ హ్యాండిల్ చేస్తుంది. ఇక ఎక్స్ఏఐ తన ప్రీమియం+ సబ్స్క్రైబర్ల కోసం ఎక్స్ఏఐ గ్రోక్ ఏఐని ప్రవేశపెట్టింది.
ఇక న్యూ ఏఐ చాట్బాట్ ఉద్దేశాన్ని మస్క్ ఇటీవల వెల్లడిస్తూ విజ్ఞానాన్ని అవగాహన చేసుకుని సొంతం చేసుకునేందుకు మానవాళికి సాయం చేసేందుకే గ్రోక్ ఏఐని ఎక్స్ఏఐ డెవలప్ చేసిందని తెలిపారు. గ్రోక్ ఏఐ సామర్ధ్యాలను ఎక్స్ఏఐ వివరిస్తూ సామర్ధ్య గణాంకాలే గ్రోక్ ఏఐ సత్తాను వెల్లడిస్తున్నాయని తెలిపింది. హ్యూమన్ఇవల్ కోడింగ్ టాస్క్లో గ్రోక్ ఏఐ 63.2 శాతాన్ని సాధించగా, ఎంఎంఎల్యూలో 73 శాతం సాధించిందని చెప్పారు. చాట్జీపీటీ కంటే గ్రోక్ ఏఐ మెరుగైందని ఎక్స్ఏఐ చెప్పుకొచ్చింది.
Read More :
Oil Palm Cultivation | ఒక్కసారి పెట్టుబడితో 30 ఏండ్ల వరకు ఆదాయం.. సబ్సిడీపై డ్రిప్, ఉచితంగా మొక్కలు