New CEO for Twitter | మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్కు కొత్త సీఈవో రానున్నారు. ట్విట్టర్ను సొంతం చేసుకుంటున్న టెస్లా సీఈవో ఎలన్మస్క్ ఇప్పటికే ఈ సోషల్ మీడియా సైట్కు కొత్త సీఈవోను ఎంపిక చేశారని సమాచారం. గతేడాది నవంబర్లో జాక్ డోర్సీ స్థానంలో సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన పరాగ్ అగర్వాల్ను 12 నెలల్లోపు తొలగిస్తే రూ.296 కోట్ల పరిహారం (38.7 బిలియన్ డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ట్విట్టర్ను అధికారికంగా ఎలన్మస్క్ టేకోవర్ చేసుకునే వరకు సీఈవోగా పరాగ్ అగర్వాల్ కొనసాగుతారు.
ప్రస్తుత ట్విట్టర్ మేనేజ్మెంట్ పనితీరు పట్ల విశ్వాసం లేదని సంస్థ చైర్మన్ బ్రెట్ టేలర్కు ఎలన్మస్క్ చెప్పినట్లు వార్త వచ్చాయి. యూఎస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)లోనూ ఈ సంగతిని ఎలన్మస్క్ వెల్లడించారు. ఇక వైరలైన ట్వీట్ల నగదీకరణకు ఎలన్మస్క్ ప్లాన్ రూపొందించారు. కంటెంట్ క్రియేటర్ల కోసం పేమెంట్ ఫీచర్ తీసుకు రావాలని కూడా యోచిస్తున్నారు.
ట్విట్టర్కు సబ్స్క్రిప్షన్ సర్వీస్ తీసుకువచ్చే విషయమై విధి విధానాల రూపకల్పనలో ఎలన్మస్క్ నిమగ్నమయ్యారు. కంపెనీ ఉద్యోగుల వేతనాలను తగ్గించనున్నారు. ఎగ్జిక్యూటివ్ల నుంచి బోర్డు సభ్యుల వరకు వేతనాల తగ్గింపుతో నెలకు 300 కోట్ల డాలర్ల ఆదా అవుతుందని మస్క్ విశ్వసిస్తున్నారు. ట్విట్టర్ బ్లూటిక్పై మోపుతున్న చార్జీ ధర కూడా మార్చనున్నారు. ప్రస్తుతం నెలకు ట్విట్టర్ బ్లూ టిక్కు 2.99 చార్జి వసూలు చేస్తున్నది. ఒకవేళ ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయకపోతే 100 కోట్ల డాలర్లు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.