న్యూయార్క్ : పనితీరు, ఉత్పాదకతను మెరుగుపరుచుకునేందుకు టెక్ దిగ్గజాలు కొలువుల కోతకు తెగబడాలని ట్విట్టర్, టెస్లా అధిపతి ఎలన్ మస్క్ (Elon Musk) సూచించారు. ట్విట్టర్లో లేఆఫ్స్ అనంతరం ఉత్పాదకత పెరిగిందని అందరూ దీన్ని అనుసరించాలని వాల్స్ట్రీట్ జర్నల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను తాను టేకోవర్ చేయకముందు పరిస్ధితిని వివరిస్తూ కంపెనీలో ప్రతి పదిమందిలో తొమ్మిది మంది ఉత్పాదకతను తగ్గించారని అన్నారు.
గత ఏడాది అక్టోబర్లో ట్విట్టర్ను మస్క్ టేకోవర్ చేసిన అనంతరం కంపెనీ ఉద్యోగులు 7500 మంది నుంచి 3500 మందికి తగ్గించారు. ఆపై మరికొందరని తదుపరి నెలల్లో మస్క్ సాగనంపగా, ఆయన అనుసరించిన కఠిన వర్క్ కల్చర్ను వ్యతిరేకిస్తూ పలువురు ట్విట్టర్కు గుడ్బై చెప్పారు. దీంతో ట్విట్టర్లో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సిలికాన్వ్యాలీలో పలు కంపెనీలు తమ పనికి ఎలాంటి విలువను జోడించలేని పరిస్ధితిని ఈ ఇంటర్వ్యూలో మస్క్ ప్రస్తావించారు.
ఉత్పాదకతపై ప్రభావం లేకుండా కొలువుల కోత చేపట్టవచ్చని అసలు ఉద్యోగుల కుదింపుతో ఉత్పాదకత పెరుగుతుందని ట్విట్టర్ బాస్ చెప్పుకొచ్చారు. పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ట్విట్టర్లో సైట్ అవుటేజెస్ ఏర్పడేందుకు దారితీస్తుందా అని ప్రశ్నించగా సైట్ బ్రేక్డౌన్స్ జరుగుతుంటాయని చెప్పుకొచ్చారు. సైట్స్ కుప్పకూలడం అసాధారణమేమీకాదని, ఇన్స్టాగ్రాం ఇటీవల క్రాష్ అయిందని గుర్తుచేశారు. ఇన్స్టాగ్రాం అవుటేజ్ను యూజర్లు ట్విట్టర్లో రిపోర్ట్ చేశారని మస్క్ చెప్పుకొచ్చారు.
Read More
Amazon | అమెజాన్ తీరుపై ఉద్యోగుల అసహనం : ఈనెల 31న టెకీల నిరసన