Parag Agarwal on Twitter | ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ తన భవితవ్యంపై బెంగ లేదని సంకేతాలిచ్చారు. 44బిలియన్ డాలర్లకు ఈ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్ను సొంతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలన్మస్క్.. అధికారికంగా ట్విట్టర్ను టేకోవర్ చేశాక మొత్తం టీంనే మార్చేస్తారని వార్తలొచ్చాయి. ప్రత్యేకించి సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్, ఇతర బోర్డు సభ్యులను తొలగిస్తారని స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. ట్విట్టర్ సేవలను మరింత పటిష్ట పరిచేందుకు పరాగ్ అగర్వాల్ వారసుడిగా కొత్త సీఈవోను ఎలన్మస్క్ ఎంపిక చేశారని సమాచారం. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఒక ట్విట్టర్ యూజర్ స్పందిస్తూ.. ప్రస్తుత ట్విట్టర్ సీఈవో @పరాగ్ గురించి ఫీల్ అవుతున్నా. ఈ ప్లాన్లన్నీ ఆయనకు తెలుసనుకుంటా. మొత్తం ఆయన జట్టు జీవితాలపై ప్రభావం చూపుతుంది అని పేర్కొన్నాడు.
దీనిపై పరాగ్ అగర్వాల్ సదరు ట్విట్టరీకి ధన్యవాదాలు తెలిపారు. తన గురించి బాధ పడొద్దని, సంస్థ సేవలు మెరుగు పడటం ఎలాగన్న అంశంపైనే దృష్టి సారించాలని సూచించారు. ఇంతకుముందు మరో యూజర్ పరాగ్ ఉద్యోగం పోతుందని పేర్కొన్నప్పుడు.. ఇంకా మేం ఇక్కడే ఉన్నాం అని రిప్లయ్ ఇచ్చారు.
పరాగ్ అగర్వాల్ స్థానంలో నూతన సీఈవోగా మస్క్ ఎవరిని తీసుకొస్తారన్న సంగతి స్పష్టంగా తెలియడం లేదు కానీ.. జాక్ డోర్సీ మళ్లీ పరాగ్ స్థానంలో వస్తారని వార్తలొస్తున్నాయి. కన్జర్వేటివ్ల ఫాలోయర్స్ను ట్విట్టర్ తొలగించడంపై, షాడ్ బ్యాన్ విధించడంపై ఒక యూజర్ చేసిన పోస్ట్పై మస్క్ రియాక్టయ్యారు. మీరు ట్విట్టర్ సీఈవోగా ట్రెండవుతుండటం నేను చూశా అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే మైపిల్లో సీఈవో మైక్ లిండెల్, డాక్టర్ వ్లాదిమిర్ జెవ్ జెలెంకో అనే కన్జర్వేటివ్స్ ఖాతాలను ట్విట్టర్ తిరిగి సస్పెండ్ చేసింది.
ట్విట్టర్ను తన ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఎలన్మస్క్.. పొదుపు చర్యల పేరిట ఉద్యోగాల్లో కోత విధించనున్నారు. క్యాపిటల్ హిల్ హింస నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ ల్యాప్టాప్లో ఎక్స్క్లూజివ్ స్టోరీల సెన్సారింగ్ చేసినందుకు గతవారం ట్విట్టర్ పాలసీ హెడ్ విజయ గద్దె తీరుపై ఎలన్మస్క్ విమర్శలు గుప్పించారు.