న్యూఢిల్లీ : భారత్లో డిజో ఎస్ పేరుతో న్యూ స్మార్ట్వాచ్ను డిజో లాంఛ్ చేసింది. లేటెస్ట్ రియల్మి వాచ్ 2 ప్రొ తరహాలో కంపెనీ తొలిసారిగా రెక్టాంగ్యులర్ డయల్తో న్యూ స్మార్ట్వాచ్ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. వాచ్ ఎస్ రియల్ టైమ్ హార్ట్ రేట్, స్లీప్ మానిటరింగ్ సపోర్ట్తో పాటు 150 వాచ్ఫేసెస్ను కలిగి ఉండటంతో వాచ్ లుక్ విభిన్నంగా ఉంటుంది.
ఈ స్మార్ట్వాచ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజెస్ రెండింటిని సపోర్ట్ చేస్తుంది. డిజో వాచ్ ఎస్ ధర రూ 2229 కాగా తొలి స్టాక్స్ పూర్తయ్యే లోగా రూ 1,999కి లభిస్తుంది. డిజో వాచ్ ఎస్ తొలుత ఏప్రిల్ 26న ప్లిఫ్కార్ట్లో సేల్ షురూ అవుతుంది. ఇక ఈ స్మార్ట్వాచ్ క్లాసిక్ బ్లాక్, గోల్డెన్ పింక్, సిల్వర్ బ్లూ కలర్స్లో లభిస్తుంది. డిజో వాచ్ ఎస్ సైక్లింగ్, వాకింగ్, రన్నింగ్, జిమ్నాస్టిక్స్, ఫుట్బాల్, మౌంటెనీరింగ్, యోగ వంటి 110కిపైగా స్పోర్ట్స్ మోడ్స్ను సపోర్ట్ చేస్తుంది.
వాచ్ ఎస్ కస్టమర్ల డైలీ స్టెప్స్, క్యాలరీలను రికార్డు చేస్తుందని డిజో పేర్కొంది. డిజో వాచ్ ఎస్లో 200ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో సింగిల్ చార్జిపై 10 రోజులు పనిచేస్తుంది, స్టాండ్బై టైమ్ 20 రోజుల వరకూ ఉంటుందని కంపెనీ పేర్కొంది.