న్యూఢిల్లీ : దేశీ అప్లయన్స్ బ్రాండ్ డైవా భారత్ మార్కెట్లో న్యూ రేంజ్ 4కే యూహెచ్డీ స్మార్ట్ టీవీలను లాంఛ్ చేసింది. రెండు మోడల్స్లో లభించే ఈ స్మార్ట్ టీవీలు ఎల్జీ వెబ్ఓఎస్ టీవీ సాఫ్ట్వేర్పై పనిచేస్తాయి. షియామి ఎంఐ టీవీ, రెడ్మి టీవీ సిరీస్లకు ఇవి దీటైన పోటీ ఇస్తాయని భావిస్తున్నారు. డైవా 4కే యూహెచ్డీ స్మార్ట్ టీవీలు రూ 34,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంటాయి.
ఈ రెండు టీవీలు గ్రేటర్ నోయిడాలోని మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్లలో దేశీయంగా తయారయ్యాయని డైవా తెలిపింది. ఈ స్మార్ట్ టీవీలపై కంపెనీ ఏడాది వ్యారెంటీ ఇవ్వడంతో పాటు మరో ఏడాది అదనంగా ఆన్ ప్యానెల్ వారంటీని ఆఫర్ చేస్తున్నామని కంపెనీ వెల్లడించింది. అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్స్లోనూ 4కే యూహెచ్డీ స్మార్ట్ టీవీలు లభిస్తాయని తెలిపింది.
4కే యూహెచ్డీ స్మార్ట్టీవీలు ఆర్మ్ సీఏ55 1.1 జీహెచ్జడ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యాం, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో అందుబాటులో ఉంటాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైం వీడియో, యూట్యూబ్, డిస్నీ+ హాట్స్టార్, స్పాటిఫై వంటి ఇన్ఫోటెయిన్మెంట్ యాప్స్తో కంటెంట్ స్టోర్ను ఈ స్మార్ట్ టీవీలు సపోర్ట్ చేస్తాయని కంపెనీ వెల్లడించింది.