న్యూఢిల్లీ : ప్రముఖ వేరబుల్స్ బ్రాండ్ బోట్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్తో న్యూ స్మార్ట్వాచ్ను లాంఛ్ చేసింది. బోట్ వేవ్ అల్టిమా పేరుతో లేటెస్ట్ స్మార్ట్వాచ్ను ప్రవేశపెట్టింది. ఈ వాచ్తో యూజర్లు నేరుగా తమ మణికట్టు నుంచే కాల్స్ను అటెండ్ చేయవచ్చు. ఈ వాచ్ భారీ క్రాక్ రెసిస్టెంట్ కర్వ్ ఆర్క్ డిస్ప్లేతో ఆకట్టుకుంటోంది. ఈ స్మార్ట్వాచ్లో స్టాండర్డ్ హెల్త్, ఫిట్నెస్ ఫీచర్లున్నాయి. బోట్ ప్రస్తుతం మార్కెట్లో 30కి పైగా స్మార్ట్వాచ్లను విక్రయిస్తోంది.
ఈ సెగ్మెంట్లో తొలి కర్వ్డ్ డిస్ప్లే కలిగిన స్మార్ట్వాచ్గా బోట్ వేవ్ అల్టిమాను కంపెనీ లాంఛ్ చేసింది. భారత్లో బోట్ వేవ్ అల్టిమా రూ 2999కి అందుబాటులో ఉంటుంది. బోట్, ఫ్లిప్కార్ట్ అధికారిక వెబ్సైట్లపై ఈ స్మార్ట్వాచ్ను కొనుగోలు చేయవచ్చు. రేజింగ్ రెడ్, యాక్టివ్ బ్లాక్, టీల్ గ్రీన్ వంటి పలు స్ట్రాప్ ఆప్షన్స్లో ఈ వాచ్ లభిస్తుంది. బోట్ వేవ్ అల్టిమా 1.8ఇంచ్ కర్వ్డ్ డిస్ప్లే, బ్లూటూత్ వీ5.3 సపోర్ట్, బిల్టిన్ హెచ్డీ స్పీకర్, హైసెన్సిటివిటీ మైక్రోఫోన్ వంటి లేటెస్ట్ ఫీచర్లను కలిగిఉంది.
ఈ స్మార్ట్వాచ్ వందకు పైగా స్పోర్ట్స్ మోడ్స్తో కస్టమర్ల ముందుకొచ్చింది. హోర్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ట్రాకింగ్ వంటి ఫిట్నెస్ ఫీచర్లను కలిగిఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెంట్తో కూడిన ఐపీ68 రేటింగ్తో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఒకసారి చార్జ్ చేస్తే పదిరోజుల బ్యాటరీ లైఫ్ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.