న్యూఢిల్లీ : తన అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలను భారత్ కేంద్రంగా ముమ్మరంగా చేపట్టేందుకు యాపిల్ (Apple) సన్నాహాలు చేపట్టింది. ఈ ప్రణాళికలో భాగంగా యాపిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఆశిష్ చౌదరికి మధ్యప్రాచ్యం, తూర్పు యూరప్, ఆఫ్రికా ప్రాంతాల్లో కంపెనీ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతలనూ అప్పగించింది. అంతకుముందు ఈ పదవిలో ఇటీవల పదవీవిరమణ పొందిన హ్యూస్ అస్మన్ సేవలందించారు.
ఐప్యాడ్స్ ఇతర ప్రోడక్ట్లను ప్రోత్సహించేందుకు యాపిల్ భారత్లో ఆఫ్లైన్ ఈవెంట్లనూ ముమ్మరం చేసింది. యాపిల్ భారత్పై దృష్టిసారించడంతో దీర్ఘకాలంలో ఉపాధి పెరగడం, యాపిల్ ఉత్పత్తుల ధరలు దిగిరావడం వంటి ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు. భారత్ మార్కెట్కు యాపిల్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఇటీవల ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా కంపెనీ సీఈఓ టిమ్ కుక్ స్పష్టం చేశారు. భారత్ తమకు అద్భుతమైన మార్కెట్ అని, భారత్పై తాము ప్రధానంగా దృష్టి సారిస్తామని చెప్పుకొచ్చారు.
గత క్వార్టర్లో భారత్లో ఐఫోన్ సేల్స్ ఆల్ టైం రికార్డు నమోదు చేశాయని కంపెనీ వెల్లడించింది. గత క్వార్టర్లో భారత్ సహా మధ్యప్రాచ్య, ఆఫ్రికా, యూరప్ యాపిల్కు కీలక మార్కెట్లుగా నిలిచాయి.ఇక ఐప్యాడ్స్ ప్రమోషన్స్ కోసం యాపిల్ భారత్లో ఆఫ్లైన్ ఈవెంట్స్నూ ముమ్మరంగా చేపడుతోంది. ఈ ఏడాదిలో ఢిల్లీ , ముంబైలో తన తొలి యాపిల్ స్టోర్స్ను లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నద్ధమవుతోందని యాపిల్ ఇండియా అధికారిక వెబ్సైట్ వెల్లడించింది. ఆపై భారత్లో యాపిల్ తన స్టోర్స్ను పెద్దసంఖ్యలో విస్తరించనుంది.
Read More :