న్యూయార్క్ : గతంలో 27,000 మంది ఉద్యోగులను తొలగించడం సంక్లిష్ట నిర్ణయమే అయినా వ్యయ నియంత్రణ చర్యలతో కంపెనీ గాడినపడిందని అమెజాన్ (Amazon) సీఈవో ఆండీ జస్సీ అన్నారు. వాటాదారులను ఉద్దేశించి రాసిన లేఖలో ఆయన కీలక విషయాలు ప్రస్తావించారు.
27,000 మంది ఉద్యోగులను తొలగించడం వంటి నిర్ణయాల అమలు కష్టమైనా ఇది కంపెనీకి మేలు చేసిందని గుర్తుచేసుకున్నారు. దీర్ఘకాలంలో కంపెనీ వృద్ధి, రాబడి పెంపు, ఆదాయాల నిర్వహణ, నగదు సరఫరాలు, పెట్టుబడిపై మెరుగైన రిటర్న్స్ అందిస్తాయా లేదా అని సమగ్రంగా విశ్లేషించి ఏ నిర్ణయమైనా తీసుకున్నామని స్పష్టం చేశారు.
వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా అమెజాన్ గత కొద్దినెలలుగా నిర్ధిష్ట వ్యాపారాలను నిలిపివేసింది. టెలిహెల్త్ సర్వీస్, ఇతర ప్రయోగాత్మక ప్రాజెక్టులను కంపెనీ నిలిపివేసిన విషయాన్ని ఆండీ జస్సీ లేఖలో ప్రస్తావించారు.
Read More