హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పోలేపల్లికి చెందిన సేంద్రియ రైతు లోకసాని పద్మారెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలోని సెంట్రల్ సిట్ర స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తన 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పద్మారెడ్డిని సన్మానించనుంది. 25 ఏండ్లుగా పద్మారెడ్డి గోఆధారిత సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అలాగే పోలేపల్లిలో 12 ఎకరాల్లో కుంకుడుపంట సాగు చేస్తూ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.