న్యూఢిల్లీ : త్వరలో లాంఛ్ కానున్న పోకో ఎఫ్4 5జీ ధర వివరాలు లీక్ అయ్యాయి. త్వరలో భారత్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనున్న లేటెస్ట్ స్మార్ట్ఫోన్ ధరను షియామి రిటైలర్ వెల్లడించారు. భారత్లో పోకో ఎఫ్4 5జీ రూ 30,000లోపు అందుబాటులో ఉంటుందని రూట్ మై గెలాక్సీ నివేదిక తెలిపింది.
మరోవైపు పోకో ఎఫ్4 5జీ ప్రారంభ ధరగా రూ 26,999కి లభిస్తుందని మరికొన్ని రిపోర్ట్స్ వెల్లడించాయి. బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్ల తర్వాత ధర రూ 23,999కి తగ్గుతుందని చెబుతున్నారు. ఇక లీక్ అయిన స్పెసిఫికేషన్స్ ప్రకారం పోకో ఎఫ్4 5జీ స్నాప్డ్రాగన్ 870 ఎస్ఓసీ చిప్సెట్తో భారత్లో మోస్ట్ అఫర్డబుల్ స్మార్ట్ఫోన్ కానుందని సమాచారం. ఇక లేటెస్ట్ స్మార్ట్ఫోన్ 64 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్తో రానుందని కంపెనీ నిర్ధారించింది.
మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)కు సపోర్ట్ చేస్తుంది. ఇక ముందు భాగంలో పోకో ఎఫ్4 5జీ 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. 67డబ్ల్యూ ఫాస్ట్చార్జింగ్ సపోర్ట్తో 4500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిన పోకో లేటెస్ట్ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 అవుటాఫ్ ది బాక్స్ ఓఎస్పై రన్ అవుతుంది.